పశువులకు ఉచిత టీకాలు
అక్షర విజేత, మాక్లూర్
ముల్లంగి, గంగరమంద గద్వాల్ క్యాంప్ గ్రామాలలో బుధవారం పశువులకు ఉచిత టీకాలను వేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యులు కిరణ్ దేశ్ పాండే గాలికుంటు టీకాలు పశువులకు వేశారు. ప్రస్తుతం పశువుల్లో ఈ గాలికుంటు వ్యాధి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని గుర్తుచేశారు. వ్యాధిని నిరోధించేందుకు ప్రభుత్వం అందించే ఈ ఉచిత టీకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.