Sunday, April 20, 2025
spot_img

 ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది

 ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
 జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ,ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  అన్నారు.
బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో   పట్టణం లో ఎన్నె పల్లి చౌరస్తా నుండి  అలం పల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 5కే రన్ ను జిల్లా ఎస్ పి కోటి రెడ్డి , అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ గార్లతో కలిసి  జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఓట్ ఫర్ షూర్  మే 13 న జరిగే  పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరుగుతుందని అన్నారు.  18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు గాను  ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. 18 సంవత్సరాలు  నిండిన ప్రతి ఒక్కరు  ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మీ ఇంటిలో గాని , పక్క ఇంటిలో ఎవరైనా అన్నాతమ్ముళ్ళు , అక్కా చెల్లెలు ఎవరు ఉన్నా వారికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయించాలని అన్నారు. ముందుగానే  ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ జాబితా లో ఓటు  ఉందా లేదా అని ఆన్లైన్  లో  చెక్ చేసుకోవాలన్నారు. కుల, మతాలకు అతీతంగా  డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్చంగా తమ  ఓటు హక్కును వినియోగించుకోవాలని  అన్నారు.
జిల్లా ఎస్ పి  కోటి రెడ్డి మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెంచడానికి స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తునామని ,పార్లమెంటు ఎన్నికలలో జిల్లా లో  80 శాతం  ఓటింగ్ పెరిగేలా అందరు ఓటు హక్కు పై అవగాహనా కలిపించుకొని  ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ  మాట్లాడుతూ నేను తప్పక ఓటు వేస్తాను అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పై అవగాహన కలుగుతుందని అన్నారు. ఓటు అమూల్యమైనదని  , ఎలాంటి ప్రలోబాలకు  లొంగకుండా ఓటు హక్కు ను  నిర్భయంగా  మే 13 వినియోగించుకోవాలని తెలిపారు. ఎంపీలను ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటామని , డబ్బు ,  మద్యం ఇతర ఆకర్షణలకు లొంగకుండా ఓటు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమములో స్వీప్ నోడల్ అధికారి ఏం.ఎ సత్తార్ , డి ఎస్ పిశ్రీనివాస్ రెడ్డి,  జిల్లా అధికారులు , వివిధ శాఖల ఉద్యోగులు  , అన్ని కళాశాల ల విద్యార్థిని , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles