భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా చందు నాయక్
అక్షరవిజేత, కొండమల్లేపల్లి
కొండమల్లేపల్లి మండల పరిధిలోగల కొర్ర తండాకు చెందిన కొర్ర చందు నాయక్ భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైనారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో భాజపా జిల్లా అధ్యక్షుడు నాగ వర్షిత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తన ఎన్నికకు సహకరించిన మండల, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు