Sunday, April 20, 2025
spot_img

ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

డి ఐ జి – సురేందర్ కత్రి

అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి

రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించుకునేందుకు, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని ఐటీబీపీ బలగాల డి. ఐ. జి సురేందర్ కత్రి అన్నారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని ఎస్పీ ఛాంబర్ నందు జిల్లా ఎస్పీ రుతిరాజ్ ,పోలీస్ అధికారులు, ఐటీబీపీ ఫోర్స్ అదికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు తగు జాగ్రత్తలు ఏర్పాట్లను చూసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల సందర్భంగ అనుసరించాల్సిన విధివిధానాలు, రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నగదు , మధ్యం రవాణ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కొనసాగుతున్న కేంద్ర బలగాల కవాతు, వాహనాలు తనిఖీలు,జిల్లాకు వచ్చే కేంద్ర బలగాల కు అవసరమైన వసతులు కల్పించుటకై తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ సమీక్షలో జిల్లా అదనపు ఎస్పీ కె. గుణ శేఖర్,కమాండెంట్ ఎస్. పి. జోషీ , డిప్యూటీ కమాండెంట్ బి. ఎస్. రెడ్డి, డి ఎస్పీ సత్యనారాయణ, సాయుధ దళ డి. ఎస్పీ నరేందర్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ వినోద్ కుమార్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles