పంట నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆడుకోవాలి
పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 అదనంగా ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు చెల్లించాలని మంగళవారం
గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నందు జిల్లా కలెక్టర్ బి.సంతోష్ కి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తరఫున రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ
జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోవడంతో రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నదని వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరమని వరితో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చిందని ఖరీఫ్ నుంచే ఈ బోనస్ చెల్లింపును అమలు చేస్తామని చేయలేదని యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ప్రతాప్ గౌడ్ , విజయ్ రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, గద్వాల మండలం పార్టీ అధ్యక్షులు రాముడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, హనుమంతు నాయుడు, రాధాకృష్ణారెడ్డి, సతీష్, ప్రభాకర్ గౌడ్,రిజ్వాన్, నవీన్ రెడ్డి, కురుమన్న,నర్సింహులు ,వాసుతిక్కన్న, మేస్త్రి తిమ్మప్ప, మధు, గంజి పేట రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.