బాల్యతండా లో ఘనంగా శ్రీ కోదండ రామాలయం, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
ముఖ్యఅతిదిగ హాజరైన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ :
అక్షరవిజేత చండ్రుగొండ :
మండలం లోని పోకలగూడెం పంచాయతీ పరిధి లో బాల్యతండా గ్రామం లో వేద పండితులు ఇంద్రగంటి గంగాధర్ శర్మ ఆధ్వర్యంలో గురువారం నాడు శ్రీ కోదండ సీతారామాలయం, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహాలు ప్రతిష్టించారు, ఈ కార్యక్రమాన్ని గత నాలుగు రోజులు నుండి వేదపండితులు ఆశీర్వచనాలతో, పూజలతో ఘనంగా బాల్యతండా వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు, ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని బాల్యతండా వాసులందరు తోచినంత చందాలు వేసుకొని ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ ప్రతిష్ట కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ హాజరై కోదండ రామలయాన్ని దర్శించుకొని తీర్ద ప్రసాదాలు తీసుకున్నారు,ఈ కార్యక్రమానికి మండలం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసారు