Monday, April 21, 2025
spot_img

ఎంపీపీ పై నెగ్గిన అవిశ్వాసం

ఎంపీపీ పై నెగ్గిన అవిశ్వాసం

సమావేశానికి హాజరైన 9 మంది సభ్యులు

నేరుగా క్యాంపు నుంచి సమావేశానిక

అక్షర విజేత కొండపాక

 

కొండపాక మండల ఎంపీపీ రాగల సుగుణ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కొండపాక ఎంపీపీ పై ఈనెల ఐదున అవిశ్వాసం ప్రకటిస్తూ 9 మంది సభ్యులు ఆర్డీవోకు అవిశ్వాస తీర్మాణ పత్రం అందజేశారు. దాంతో ఆర్డీవో బన్సీలాల్ అవిశ్వాస తీర్మాణ సమావేశానికి తేది ప్రకటించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. తీర్మానం ఇచ్చిన నాటి నుంచి క్యాంపులోకి వెళ్లిన ఎంపీటీసీ సభ్యులు నేరుగా సమావేశ మందిరానికి వచ్చారు. సమావేశం 9 మంది హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో నిబంధనల ప్రకారం అవిశ్వాసం నెగ్గిందని ఆర్డిఓ బన్సీలాల్ ప్రకటించారు. కొండపాక మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కుకునూరుపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన గీత ఆరోగ్యంతో మృతి చెందింది. దాంతో 13 మంది ఉన్నారు. సమావేశానికి మూడింటిలో రెండు మంది సభ్యులు కావలసి ఉండగా అంతేమంది హాజరయ్యారు. నివేదికను పై అధికారులకు పంపిస్తామని అధికారుల సూచన మేరకు ఎంపీపీ ఎన్నిక కోసం తేదీ ప్రకటిస్తామని ఆర్డీవో తెలిపారు. కాగా కొండపాక మండలం ఎంపీపీ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో కొండపాక ఎంపీటీసీ సభ్యురాలు మంచాల అనసూయకు దక్కనుంది.

పోలీసు బలగాల మధ్య…

కొండపాక ఎంపీపీ అవిశ్వాస సమావేశం సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసు బలగాలను కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు అవిశ్వాసానికి సరైన కోరం ఉండడం వల్ల ప్రశాంత వాతావరణంలో అవిశ్వాసం నెగ్గింది.

నిధులు గౌరవం లేకపోవడంతోనే పార్టీ మారాను

కొండపాక ఎంపీటీసీ సభ్యురాలు మంచాల అనసూయ

ఐదేళ్ల పాలనలో ఎంపీటీసీ లకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పాటు ఎలాంటి గౌరవం ఇవ్వకపోవడంతోనే బిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కొండపాక ఎంపీటీసీ సభ్యురాలు మంచాల అనసూయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పార్టీ ఆకర్షితులై మండల అభివృద్ధి కోసం పార్టీలో చేరినట్టు తెలిపారు. డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు

అవిశ్వాసంపై సమావేశం జరుగుతుండడంతో కొండపాకకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ స్థానం లభిస్తుందనే భావనతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు అనంతుల నరేందర్ మంచాల చిన్న శ్రీనివాస్ రెడ్డేమైన రవీందర్, వాసరి లింగారావు, విరుపాక శ్రీనివాసరెడ్డి , కోల ఉపేందర్ ఐలం యాదవ్ కనక రాములు తదితరులున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles