Monday, April 21, 2025
spot_img

దగాకోరు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించండి!

దగాకోరు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించండి!

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీని, దానితో అంటకాగుతున్న పార్టీలన్నింటిని తన్ని తరమండి!
బ్రాహ్మణీయ, హిందుత్వ ఫాసిస్టు ప్రమాదం నుండి దేశాన్ని,

ప్రజలను కాపాడండి!
భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేయండి. ప్రజల విప్లవ రాజకీయాధికారాన్ని స్థాపించండి!

అక్షర విజేత, భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో,

ప్రియమైన ప్రజలారా!
18వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా 2024
ఏప్రిల్ నుండి జూన్ వరకు జరుపుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో తమ గెలుపు కోసం అధికార పార్టీలతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజలను
– మళ్ళీ మళ్ళీ మోసగించడానికి తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. 2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పాలక
పార్టీలన్నీ ఓట్ల కోసం వేల కోట్ల డబ్బును, మద్యంను పంచిపెట్టిన తాజా సంగతులు ప్రజలందరికి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు
జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా అధికారాన్ని చేపట్టడానికి ధనబలం, కండబలం, మద్యం, కుల, మత రాజకీయాలతో సిద్ధమయ్యారు.
దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలక వర్గాల ముఠాలు కులతత్వ, మతతత్వ, ప్రాంతీయ రాజకీయాలతో బ్రష్టు పట్టించిన
పార్లమెంట్ వ్యవస్థను మరోసారి అపహాస్యం చేయడానికి సిద్ధమయ్యాయి. మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు దళారీ నిరంకుశత్వాన్ని
చట్టబద్దం చేసి దాన్ని పటిష్టం చేసే ఒకే ఒక లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయి. అధికారాన్ని చేపట్టాకా ఇక్కడ కార్యనిర్వాహక వర్గమే అన్ని
నిర్ణయాలను, ఆర్డినెన్స్ లను జారీ చేస్తుంది. దోపిడీ అనుకూల విధానాలను నిరంకుశంగా అమలు జరుపుతుంది. నిరంకుశ అధికారాన్ని
ప్రజాస్వామ్యం పేరుతో చలామణీ చేస్తూ పీడిత ప్రజలను మోసగించి, అణిచివేసి నిరంకుశత్వాన్ని నిలుపుకునే సాధనంగా పార్లమెంట్ ను
తయారు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలు నామమాత్రమే. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వట్టి బూటకం. ఈ బూటకపు
పార్లమెంట్ వ్యవస్థలో విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు సేవకులుగా పని చేయడానికి పాలక వర్గ ముఠాలు అధికారం కోసం.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటములు పోటి పడుతున్నాయి తప్పా ప్రజల ప్రయోజనాల కోసం ఏ
మాత్రం కాదు.
ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న బీజేపీ 2019లో జరిగిన 17వ పార్లమెంట్ ఎన్నికల ముందు కుట్రపూరితంగా పుల్వామా
సంఘటనను సృష్టించి, హిందూ మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకున్నది. ఆర్ఎస్ఎస్,
బీజేపీలు ఈ సారి కూడా అలాంటి దుర్మార్గపు, కుట్రపూరిత పన్నాగం పన్నారు. ఎన్నికల ముందు అయోధ్యలో రెండు మతాల ప్రజల మధ్య
విచ్చురేపే రామమందిరాన్ని రెండు వేల కోట్లతో నిర్మించి రాజ్యాంగ విరుద్ధంగా, నిరంకుశంగా ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభించి
రాజకీయం చేసిన విషయం ప్రజలందరికి విధితమే. ఈ రోజు సిఎఎను అమల్లోకి తీసుకొచ్చింది. రేపు ఎలాంటి దుశ్చర్య వుండబోతుందో
ఊహించడం కష్టమేమి కాదు. ఎన్నికల కమీషన్ ను నామమాత్రం చేసి ఈ ఎన్నికలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే
మూడు నెలల పాటు ఎన్నికల తతంగాన్ని నిర్వహిస్తున్నది.
పదేండ్ల మోది పరిపాలనలో మధ్య యుగాల నాటి ఫ్యూడల్ నిరంకుశత్వ హిందుత్వ రాష్ట్రాన్ని స్థాపించే లక్ష్యంతో బ్రాహ్మణీయ హిందుత్వ
ఫాసిజాన్ని అమలు చేస్తూ దేశాన్ని ప్రమాదకరమైన సంక్షోభంలోకి నెట్టాడు. సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, భూస్వామ్య
వర్గాల దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నమ్మిన బంటులా పని చేస్తున్నాడు. మన దేశ సంపద, గనులు, అడవులు, భూములు,
వ్యవసాయం, విద్య, వైద్యం, విమానాశ్రయాలు ఓడరేవులు ఒకటేమేటి ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్థులను పరుకుగా చేసి కారు చౌకగా
అమ్మేస్తున్నారు. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్టార్టాప్ కంపెనీల పేర్లతో దోచి పెడుతున్నారు. దేశంలో సామ్రాజ్యవాద
బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ మేక్ ఇన్ ఇండియా అంటూ ఉదరగొట్టుకుంటున్నారు. నరేంద్ర మోదీ పాలనలో దోపిడి
వర్గాల అనుకూల విధానాల వలన ఒక శాతం వున్న సంపన్నుల సంపద దేశ సంపదలో 40 శాతంగా వున్నట్లు సర్వే నివేధికలు చెపుతున్నాయి.
దేశంలో ఎనిమిది లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూత పడేయడం వలన లక్షలాది మంది శ్రామికులు
ఉపాధి కోల్పోయారు. లేఆఫ్. వీఆర్ఎస్ పేరుతో 2.7 లక్షల ఉద్యోగాలను తొలిగించారు. ఫలితంగా ఆర్ధిక అసమానతలు తీవ్ర స్థాయికి
చేరాయి. ఆకలి, దారిద్ర్యం, పేదరికం 70 శాతానికి, నిరుద్యోగం కోట్లల్లో పెరిగింది. నేడు పౌష్టిక ఆహారం దొరకని, కొనుగోలు శక్తి లేని
జనాభా దాదాపు 70 శాతానికి పెరిగి ధారధ్య రేఖ దిగువన జీవిస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి. అంటే మన దేశం పేదరికంతో,
నిరుద్యోగం, అధిక ధరలతో, పన్నుల భారంతో ఎంతో సంక్షోబాన్ని ఎదుర్కొంటున్న వాస్తవాన్ని మసి పూసి మారేడు కాయ చేయడానికి
అబద్దాల కోరు మోట 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.
మోదీ వాగ్దానాలతో కార్మికులను, రైతాంగాన్ని, మధ్య తరగతి ప్రజలను, దళితులను, మహిళలను, ఆదివాసులను, మత మైనార్టీలను ఎంత
మోసగించారో, కోట్లల్లో ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామన్న వాగ్దానం ఎంత బూటకమో అర్ధమవుతుంది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల
ప్రకారం భారతదేశం జీడిపి వృద్ధి రేటు 3.7 ట్రిలియన్ల డాలర్లు మాత్రమే. కాని 8.4 శాతం వృద్ధి రేటును సాధించినట్లుగా చూపిస్తున్నారు. మన
దేశం కేవలం దిగుమతులపై మాత్రమే ఆధారపడుతున్నది. విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులన్నీ మన దేశంలో నెలకొల్పిన బహుళ
జాతి కంపెనీలవే. అందులో కేవలం వాటాదారు మాత్రమే. దేశ దారిద్ర్యం ఇలా వుంటే ప్రజలను నమ్మించి మోసగించడానికి మోదీ మాత్రం
వికనీత్ సంకల్ప యాత్ర ద్వారా ఆర్ధిక అభివృద్ధిని సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. మోదీ అబద్ధాలను, అర్ధ సత్యాలను, సత్తాలేని
ఊక దంపుడు ఉపన్యాసాలను, మోదీ నిరంకుశ సారధ్యాన్ని రోజు ఆకాశానికెత్తడమే పనిగా గోదీ మీడియా పెట్టుకుంది.
మోదీ పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలలో నేరుగా ఆర్ఎ.ఎస్.ఎస్ రాజకీయాలను నెరుపుతున్నాడు. అన్ని ప్రభుత్వ
యంత్రాంగాలను తన గుప్పెట్లో పెట్టుకొని సర్వం తానై పాలిస్తూ వస్తున్నాడు. రాజ్యాంగ బద్ద సంస్థలైనా ప్రణాళికా సంఘం, సీబీఐ, ఈడీ,
ఆర్.సర్.ఐ. చివరికి న్యాయవ్యవస్థ స్వతంత్రతను సైతం దెబ్బతీపాడు. ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే నాయకుడు అంటూ శాశ్వత నిరంకుత
పాలన దిశగా తీసుకుపోతున్నాడు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చి ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. ప్రజా
ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక, రాజకీయ స్వేచ్ఛను, పౌరహక్కులను, సార్వభౌమత్వాన్ని
స్వావలంభనను, బ్రహ్మణీయ హిందుత్వ ఫాసిజం ద్వారా ధ్వంసం చేశాడు. సామాజిక విప్లవం చేస్తున్న మావోయిస్టు పార్టీ నిర్మూలనకు భారత
సైన్యాల ద్వారా వ్యూహాత్మక సూరజ్ కుండ్- కగార్ పేరుతో నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రజలారా! మరోసారి బీజేపీ అధికారంలోకి
తీసుక రావడం అంటే తల కొరివి పెట్టుకోవడమే. ఈ రోజు చెప్పుకుంటున్న నామమాత్రపు ప్రజాస్వామ్యం కూడా ధ్వంసం అయిపోయి
భయంకరమైన దుర్భర పరిస్థితులను కొని తెచ్చుకోవడమే. అందుకే బీజేపిని, దానితో అంటకాగే పార్టీలన్నింటిని తన్ని తరమండి.
అదే విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపిని ఓడించి అధికారాన్ని చేపట్టే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. మొట్ట మొదట
దేశంలో ప్రపంచీకరణకు పునాదులు వేసిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను దగా చేయడానికి అధికారం కోసం ఆరాటపడుతుంది. కాని
ఇండియా కూటమి అనే కలగూర గంపలో వున్న వైరుధ్యాల వలన ఇంకా ఐక్యం కాలేకపోతున్నారు. బీజేపిని ఓడించడానికి గాని, హిందూ
రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని అడ్డుకునే పథకం గాని ఈ కూటమికి లేదు. సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్లకు పాదసేవా చేసుకోవడానికి, ప్రపంచ
పోటీ మార్కెట్లో దేశాన్ని అమ్మివేయడానికి ఐదేళ్ళ అధికారం కోసం పాలక ముఠాల మధ్య కొట్లాడుకోవడం తప్పా నీల వలన భారత ప్రజలకు
ఓరిగేది ఏమిలేదు. పార్లమెంట్ పార్టీలన్నీ నిజమైన ప్రజాస్వామ్యానికి, స్వావలంభనకు, పార్వభౌమత్వానికి పూర్తి వ్యతిరేకమైనవి. పీడిత ప్రజలపై
దుర్మార్గపు పాలన కొనసాగించడంలో వీటి మధ్య పెద్ద తేడా ఏమి వుండబోదు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాధికారం.
కావాలి. ప్రజల రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి నూతన ప్రజాస్వామిక విప్లవం లో భాగస్వామ్యం కావాలి..
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి. బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపిని, దానితో
అంటకాగే పార్టీలన్నింటిని తన్ని తరమండి.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేసే కాంగ్రెస్ పార్టీని, ఓట్ల కోసం వచ్చే ఇతర
పార్టీలన్నింటిని నిలదీయండి.
4. విప్లవ ప్రజా రాజ్యాధికార సంస్థల్లో చేరండి. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేసి
నిర్మించుకోండి.
విప్లవాభివందనాలతో,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
సీపీఐ మావోయిస్టు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles