జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారికి అదనపు బాధ్యతలు
అక్షర విజేత,చొప్పదండి;
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎల్ కృష్ణ ప్రసాద్ కు అదనపు బాధ్యతలుగా చొప్పదండి ఆస్పత్రి డిడివోగా నియమిస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ ప్రసాద్ చొప్పదండి ఏరియా ఆసుపత్రి డ్రాయింగ్ అధికారి (డిడివో) గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.