Tuesday, April 8, 2025
spot_img

ఒడిశా గవర్నర్ గా హరిబాబు

ఒడిశా గవర్నర్ గా హరిబాబు

అక్షరవిజేత,న్యూఢిల్లీ :

పలు రాష్ట్రాల గవర్నర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. బీహార్, ఒడిశా, మిజోరాం, కేరళ, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్లు మారారు. ఒడిశా గవర్నర్ పదవికి రఘుబర్ దాస్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో పాటు 5 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను కూడా రాష్ట్రపతి నియమించారు. రాష్ట్రపతి అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. దీంతో పాటు బీహార్ గవర్నర్‌గా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నియమితులయ్యారు.

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేసింది. అలాగే ఒడిశా గవర్నర్‌గా ఉన్న రఘుబర్ దాస్ రాజీనామాను ఆమోదం తెలిపింది. మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్ నియామకం కాగా, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది మోడీ సర్కార్‌. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు బిహార్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక మణిపూర్ గవర్నర్‌గా హోంశాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లా నియామకం అయ్యారు. ఈ నియామకాలు వారు తమ సంబంధిత కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించే తేదీల నుండి అమలులోకి రానున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles