ర్యాలీ బ్యాడ్మింటన్ కోర్ట్ ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
అక్షర విజేత, కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాలీ బ్యాడ్మింటన్ కోర్టును నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించి వారి నుండి మన్ననలు పొందాలని సూచించారు మరియు వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెలు బాల్ రెడ్డి, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ సర్గారి భీమ్ రెడ్డి, నాయకులు సర్గారీ రంగా రెడ్డి, సర్గారి రవీందర్ రెడ్డి, మాదాస్ నరేష్, కొసరు రవి, మల్లేష్, నిజాంపేట్ సోషల్ మీడియా కన్వీనర్ విద్యాసాగర్, నిర్వాహకులు అన్వేష్, సాగర్, చైతన్య, సాయి కిరణ్, మరియు తదితరులు పాల్గొన్నారు.