జైనూర్ లో రూ. 7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
రాబోయే లోక్ సభ ఎన్నికల దృశ్య ఈ రోజు జైనూర్ సిఐ తన సిబ్బంది తో జైనూర్ మండలంలోని ఉషేగామ్ గ్రామ శివారులో ఉదయం 11 గంటలకు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఆర్టిసి బస్ ఉట్నూర్ నుండి జైనూర్ వెళ్లుతుండగా దానిని ఆపి తనికి చేయగా అందులో ఒక గరికముక్కు విజయ కుమారి అను ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 7,31,350/- లను తీసుకుని వెళ్లుతుండగా పట్టుకున్నట్లు ఈ నగదును జప్తు చేసి జైనూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి అప్పగించి నట్టు జైనూర్ సిఐ అంజయ్య తెలిపినారు ఈ తనిఖీల్లో సిర్పూర్ యు ఎస్ఐ మాధవ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు