కాంగ్రెస్ లో చేరిన మాజీ బిఆర్ ఎస్ సర్పంచ్
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
సిరికొండ మండలం లోని పోతునూరు గ్రామ బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ మంజుల బాలయ్య సోమవారం రోజున ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద వాల్గాట్ నర్సారెడ్డి, ఎర్రన్న, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.