ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
అక్షర విజేత, మాక్లూర్
మండల కేంద్రంలోని మాక్లూర్ లో ఉన్న సహకార సంఘం ఆధ్వర్యంలో ముల్లంగి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని స్థానిక సొసైటీ చైర్మన్ అశోక్ ప్రారంభించారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని ఆయన సూచించారు. దళారుల చేతుల్లో మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శేఖర్, కార్యదర్శి సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.