Sunday, April 20, 2025
spot_img

చెంగిచెర్ల ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి బాధితులకు న్యాయం చేయాలి

చెంగిచెర్ల ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి బాధితులకు న్యాయం చేయాలి

బిజెపి జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి

అక్షర విజేత వర్ధన్నపేట

మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల లో హోలీ పండగ జరుపుకుంటున్న సందర్భంలో జైశ్రీరామ్ అనే నినాదాలు చేసిన యువకుల పైన ముస్లిం గూండాలు మూకుమ్మడిగా వచ్చి ఆ యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చినా చిన్న పిల్లల పైన మహిళల పైన వృద్ధుల పైన గర్భిణీ అయినా రూపా అనే మహిళ పైన కూడ దాడి చేశారు. విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాద్ నడిబొడ్డుననే హిందువులకు రక్షణ లేదు హిందువులకు కనీసం మన దేవుని స్మరించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. ఇంత జరుగుతున్న ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం ఏం పట్టించుకోవడం లేదు. ఒక బోనాల పండగ చేసుకున్నప్పుడు గానీ హిందువుల పండుగలు ఏది చేసుకున్నా కూడా జై శ్రీ రామ్ నినాదాలు నినాదాలు ఇచ్చిన మహిళల పైన కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలోనే హిందువులకి రక్షణ లేకుండా పోతుంది. ఇదొక మరో బైంసాగా మారుతుంది అనిపిస్తుంది అని ఆయన అన్నారు. మన హిందువులను మనమే కాపాడుకునే సమయం వచ్చింది ప్రతి ఒక్కరూ ఈ సమస్య పైన స్పందించాలని ప్రభుత్వం బాధితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేయాలని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles