Monday, April 21, 2025
spot_img

మీ నమ్మకాన్ని నిలబడుతాo ..

మీ నమ్మకాన్ని నిలబడుతాo ..
పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి..
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాo..
ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన నీలం మధు ముదిరాజ్..

అక్షర విజేత పటాన్చెరు

తనపై నమ్మకంతో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీలం మధు ముదిరాజ్ పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అందరి సహకారంతో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ లాంటి మహానేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానానికి తనను ఎంపిక చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని ఈ విషయాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపొందేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు గార్ల ఆశిస్సులతో పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలుపుగోలుగా ఉంటూ కాంగ్రెస్ శ్రేణుల సహకారంతో మెదక్ సీటు ను కాంగ్రెస్ ఖాతాలో వేస్తామని స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles