గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి
ధారూర్ హెచ్.పీ గ్యాస్ డీలర్ యూనూస్ ఇబ్రహీం
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ తప్పకుండా చేయించుకోవాలనీ ధరూర్ హెచ్.పీ గ్యాస్ డీలర్ యూనుస్ ఇబ్రహీం పేర్కొన్నారు. బుధవారం యూనూస్ ఇబ్రహీం అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ మండలంలోని ఈ కేవైసీ చేసుకోని వంట గ్యాస్ వినియోగదారులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈనెల 31 వ తేదీ వరకు అవకాశం ఉందనీ అన్నారు. ఈ అవకాశన్ని మండల వంట గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.