Monday, April 21, 2025
spot_img

ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
—భీంగల్ లో ఘనంగా 5కే రన్.

అక్షర విజేత మోర్తాడ్

భీంగల్ పట్టణ కేంద్రంలో గురువారం బాల్కొండ నియోజకవర్గ హెడ్ క్వర్టర్ లోని భీంగల్ పట్టణంలో వేల్పూర్ రోడ్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబెడ్కర్ చౌరస్తా వరకు భీంగల్ తహశీల్దార్ శ్రీలత, కమ్మర్ పల్లి తహశీల్దార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్, మెప్మా సిబ్బంది, కృషి హై స్కూల్, శ్రీ నారాయణ హై స్కూల్ విద్యార్థులు, తహసీల్దార్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, బూత్ లెవల్ ఆఫీసర్లు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు కలిసి 5కే రన్ లో పాల్గొన్నారు. భీంగల్ పట్టణ ప్రజలకి ఓటుపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా యువత ఓటింగ్ శాతం పెంచాలన్నారు. ప్రతి ఒక్క యువతి యువకులు అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోని, పటిష్టమైన సమాజాన్ని రూపుదిద్దికోవడానికి సకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్శ అనంత్ రావ్, జే.జే నర్సయ్య, రంజిత్, వాక మహేష్, డిప్యూటీ తహసీల్దార్ మధు, గీర్దావర్ ధనుంజయ్, ఎలక్షన్ డీటీ అశ్విన్ బాబు, కృషి హైస్కూల్, శ్రీ నారాయణ హైస్కూల్ విద్యార్థులు, బాల్కొండ నియోజకవర్గ అన్ని మండలాల అధికారులు, బూత్ లెవల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles