Monday, April 21, 2025
spot_img

కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతామంటే భయపడం

కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతామంటే భయపడం
. . . బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, కాంగ్రెస్ పరిపాలన వంద రోజులు అయ్యేదాకా ప్రశ్నించ కూడదని ఇన్ని రోజులు ఆగామని ఇప్పుడు ప్రశ్నించక తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు . బుదవారం జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడురు. మాజీ మంత్రి, బోదన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లు కేసులు పెడుతామని బేదిరిస్తున్నారని వారి బేదిరింపులకు భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఒక కోటరీ అయితే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కోటరీ అని ఆయన కోటరీ అని నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని ఉద్దేశిస్తూ బడే బాయి అన్నారని అంటే సీఎం రేవంత్ రెడ్డి చోటాబాయి అన్నట్లు అర్థమవుతుందన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిమాట మీద నిలబడే వ్యక్తి కాదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచాకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు . టిఆర్ఎస్ సమయంలో కేసీఆర్ కేసులు పెట్టి ఉంటే సుధర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ స్వేచ్ఛగా తిరిగే వారా అని ప్రశ్నించారు . సుధర్శన్ రెడ్డి ముమ్మాటికి లిక్కర్ మీద బతుకుతున్నారని ఆరోపించారు .గోడకు బంతిని కొడితే తిరిగి తన వైపే వస్తుందని సుధర్శన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు అలాగే ముఖ్యమంత్రి మూడు నెలల్లో 5000 కోట్లు దోచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణ గుప్పించారు . మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కళ్యాణ లక్ష్మి అందించామని కానీ కాంగ్రెస్ హయాంలో ప్రజలకు తులం బంగారం కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన మీద 38 కేసులు న కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీపై కేసును పెడతామన్నారు . ఆర్మూర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ కుమార్ బ్రోకర్ గా బిఆర్ఎస్ సాయంలో మంజూరైన కళ్యాణ్ లక్ష్మి చెట్లను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు కల్లి కల్లు, బెల్ట్ మాఫియా రాజ్యమెలుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి లేదా పక్కకు తప్పుకోండి అని అన్నారు.ఎమ్మెస్సీ కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని ఆయన జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయం అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles