Sunday, April 20, 2025
spot_img

మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని పీఎస్ లో ఫిర్యాదు

మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని పీఎస్ లో ఫిర్యాదు

అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిరాధారమైన ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి రామారావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ నిజామాబాద్ ఒకటవ టౌన్ లో బుదవారం టీపీసీసి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ లు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి రామారావు మాట్లాడుతూ “మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సిఎం రేవంత్ రెడ్డి, మూడు నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్ లకు అనుమతులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారని, అలా వసులు చేసిన రూ.2,500 కోట్లను డిల్లీకి పంపించారని పేర్కొనడం జరిగిందని, ఓవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు రియాల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, కత్తెర పెట్టుకొని జేబు దొంగలా తిరుగుతున్నారు” అంటూ ఆరోపణలు చేసారని, అభూతకల్పనలతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశ్యంతో ఇలా లేనివి, ఉన్నట్లు బహిరంగముగా ఆరోపించడము సరైంది కాదన్నారు. రైస్ మిల్లర్లు, ఇసుక దందా, బిల్డర్లను, రియాల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఊహాజనితమైన విధంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరం అని, కావున కె.టి రామారావును విచారణ నిమిత్తమై వెంటనే అరెస్టు చేసి పై విషయాలను రుజువు పరచవలసిందిగా, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతని పై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles