Tuesday, April 8, 2025
spot_img

పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారుల కేటాయింపు

పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారుల కేటాయింపు

 

అక్షర విజేత సిద్దిపేట్

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ లోక్ సభ ఎన్నికలు 2024 పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులు,
1009 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 4940 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు.
అందులో 1235 మంది ప్రిసైడింగ్ అధికారులు,1235మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2470 మంది ఇతర పోలింగ్ అధికారులున్నారు.
ప్రతి టీములో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి ఆయా శాఖల ద్వారా సమాచారం అందించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రెహమాన్, ఈడీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles